మదార్‌గౌడ్‌కు కన్నీటి వీడ్కోలు

ABN , First Publish Date - 2021-12-03T06:43:34+05:30 IST

మాలి దేశంలో పనిచేస్తూ అనారోగ్యంతో దుబాయ్‌ దేశంలోని ఆసుపత్రిలో మృతిచెందిన జనగాం మదార్‌గౌడ్‌(50) మృతదేహానికి గురువారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.

మదార్‌గౌడ్‌కు కన్నీటి వీడ్కోలు
మదార్‌ మృతదేహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే

చిట్యాల రూరల్‌, డిసెంబరు 2: మాలి దేశంలో పనిచేస్తూ అనారోగ్యంతో దుబాయ్‌ దేశంలోని ఆసుపత్రిలో మృతిచెందిన జనగాం మదార్‌గౌడ్‌(50) మృతదేహానికి గురువారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. దుబాయ్‌ నుంచి కార్గో విమానంలో మృతదేహం 2న శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంది. బంధువులు మిత్రులు స్వగ్రామానికి తీసుకువచ్చారు. గ్రామానికి మదార్‌ మృతదేహం చేరుకోవడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. మదార్‌ను కడసారి చూసేందుకు గ్రామస్థులు, బంధుమిత్రులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. గ్రామంలో నిర్వహించిన అంత్యక్రియల్లో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, సర్పంచ సర్పంచ కంచర్ల శ్రీనివా్‌సరెడ్డి హాజరై మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుం బ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పెద్దగోని సత్తయ్యయాదవ్‌, ఉపసర్పంచ ఉయ్యాల లింగయ్యగౌడ్‌, సుంకరి యాదగిరి, నాగరాజుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2021-12-03T06:43:34+05:30 IST