టెక్‌ మహీంద్రా లాభం రూ.1,065 కోట్లు

ABN , First Publish Date - 2020-10-24T07:23:08+05:30 IST

సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి టెక్‌ మహీంద్రా లాభం రూ.1,064.60 కోట్లుగా నమోదైంది...

టెక్‌ మహీంద్రా లాభం రూ.1,065 కోట్లు

ముంబై: సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి టెక్‌ మహీంద్రా లాభం రూ.1,064.60 కోట్లుగా నమోదైంది. మార్జిన్లు మెరుగైనప్పటికీ వార్షిక ప్రాతిపదికన లాభం 5.27 శాతం తగ్గింది. గడిచిన మూడు నెలల్లో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 3.32 శాతం వృద్ధి చెంది రూ.9,371 కోట్లకు చేరుకుంది. సమీక్షా కాలానికి కంపెనీ 42.1 కోట్ల డాలర్ల విలువైన కొత్త కాంట్రాక్టులు కుదుర్చుకుంది. వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.15 ప్రత్యేక డివిడెండ్‌ చెల్లించనున్నట్లు వెల్లడించింది. వచ్చే ఏడాదిలో ఉద్యోగుల జీతాలను దశల వారీగా పెంచనున్నట్లు ప్రకటించింది. 

Updated Date - 2020-10-24T07:23:08+05:30 IST