టెక్నాలజీ పరిమితంగా వాడాలి
ABN , First Publish Date - 2020-08-15T09:47:38+05:30 IST
టెక్నాలజీని పరిమితంగా వినియోగించినప్పుడే దాని వల్ల ఉపయోగం ఉంటుందని, అతిగా వినియోగిస్తే అనర్థాలు తప్పవని ఏపీ సీఐడీ అదనపు
ఏపీ సీఐడీ ఏడీజీ సునీల్కుమార్
వెంకోజీపాలెం, ఆగస్టు 14: టెక్నాలజీని పరిమితంగా వినియోగించినప్పుడే దాని వల్ల ఉపయోగం ఉంటుందని, అతిగా వినియోగిస్తే అనర్థాలు తప్పవని ఏపీ సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్ పి.వి.సునీల్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ’డిజిటల్ ప్రపంచంలో ఆరోగ్యం-వ్యసనంగా మారకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు’ అనే అంశంపై ఏపీ సీఐడీ, సైబర్ పీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వెబినార్లో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. శనివారం యూట్యూబ్ చానల్ లైవ్లో ‘ఆన్లైన్లో పాఠ్యాంశాలు బోధించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు’ అనే అంశంపై వెబినార్ నిర్వహించనున్నామని, దీనిని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు కోరారు.