resume: నేటి నుంచి పట్టాలెక్కిన తేజాస్ ఎక్స్‌ప్రెస్

ABN , First Publish Date - 2021-08-07T17:44:18+05:30 IST

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) నడుపుతున్న తేజాస్ ఎక్స్ ప్రెస్ శనివారం మళ్లీ పట్టాలెక్కింది....

resume: నేటి నుంచి పట్టాలెక్కిన తేజాస్ ఎక్స్‌ప్రెస్

న్యూఢిల్లీ : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) నడుపుతున్న తేజాస్ ఎక్స్ ప్రెస్ శనివారం మళ్లీ పట్టాలెక్కింది. కరోనా వైరస్ మహమ్మారి వల్ల రద్దు అయిన తేజాస్ ఎక్స్ ప్రెస్ రైలు ఎట్టకేలకు శనివారం పునర్ ప్రారంభం అయింది. అహ్మదాబాద్-ముంబై,లక్నో-న్యూఢిల్లీల మధ్య తేజాస్ రైలు రాకపోకలు సాగించనుంది.2019 అక్టోబరులో ప్రారంభమైన ఈ తేజాస్ రైలు కరోనా వల్ల ఇన్నాళ్లు నిలిచిపోయింది. అత్యంత వేగంగా నడిచే ఈ రైలు ప్రయాణికులకు ఉచితంగా రూ.25 లక్షల బీమా సౌకర్యం కల్పించారు.78 సీట్ల సామర్ధ్యం గల ఏసీ ఛైర్ కార్ బోగీలో ప్రయాణికులకు నాణ్యత గల ఆహారం అందజేస్తారు.ఈ రైలులో ఆర్వో వాటర్ ఫిల్టరుతోపాటు ప్యాకేజేడ్ వాటర్ బాటిళ్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించిన తేజాస్ ఎక్స్ ప్రెస్ ప్రయాణించడానికి ఎక్కువ మంది ప్రయాణికులు ఆసక్తి చూపిస్తున్నారు.


Updated Date - 2021-08-07T17:44:18+05:30 IST