భర్త వేధింపులంటూ... టెక్కీ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-12-11T18:12:44+05:30 IST

నాలుగేళ్ళపాటు ప్రేమలో కొనసాగి వివాహం చేసుకున్నాక భర్త వేధిస్తున్నారంటూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు ఆత్మ హత్యకు పాల్పడిన సంఘటన నగరంలోని అమృతహళ్ళి పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు

భర్త వేధింపులంటూ... టెక్కీ ఆత్మహత్య

బెంగళూరు: నాలుగేళ్ళపాటు ప్రేమలో కొనసాగి వివాహం చేసుకున్నాక భర్త వేధిస్తున్నారంటూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు ఆత్మ హత్యకు పాల్పడిన సంఘటన నగరంలోని అమృతహళ్ళి పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా... అమృతహళ్ళి వీరణ్ణ పాళ్యలో నివసించే టెక్కీ సంగీతా(26) ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అమృతహళ్ళి పోలీసులకు సంగీతా రాసినట్లుగా ఉండే డెత్‌నోట్‌ లభించినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో నాలుగేళ్ళు ప్రేమించుకున్నాక పెళ్ళి చేసుకున్నామని ఆతర్వాత కొంతకాలం బాగానే ఉన్నామని రాసుకున్నారు. ఇటీవల కాలంలో భర్త అన్నింటికీ ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఉండటంతో పోలీసులు అదే కోణంలో విచారణలు జరుపుతున్నారు. భర్తతో పాటు కుటుంబీకుల సమాచారం కోసం పోలీసులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. 

Updated Date - 2021-12-11T18:12:44+05:30 IST