తెలంగాణా క్యాబినెట్ భేటీ నేడు

ABN , First Publish Date - 2020-08-05T16:58:51+05:30 IST

తెలంగాణ మంత్రి వర్గం బుధవారం సమావేశం కానుంది.

తెలంగాణా క్యాబినెట్ భేటీ నేడు

హైదరాబాద్: తెలంగాణ మంత్రి వర్గం బుధవారం సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువగా కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది. ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే నియంత్రిత వ్యవసాయం, కరోనా నేపథ్యంలో విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. దాదాపు రెండు నెలల తర్వాత ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం కానుంది. 

Updated Date - 2020-08-05T16:58:51+05:30 IST