అంబేద్కర్‌ స్పూర్తితోనే తెలంగాణ వచ్చింది..: కోదండరాం

ABN , First Publish Date - 2020-02-22T20:46:11+05:30 IST

హైదరాబాద్: అంబేద్కర్‌ స్పూర్తితోనే తెలంగాణ వచ్చిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.

అంబేద్కర్‌ స్పూర్తితోనే తెలంగాణ వచ్చింది..: కోదండరాం

హైదరాబాద్: అంబేద్కర్‌ స్పూర్తితోనే తెలంగాణ వచ్చిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శనివారం కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అంబేద్కర్‌ విగ్రహాన్ని తొలగించడం మంచిదికాదన్నారు. ప్రభుత్వం రాజ్యాంగ స్పూర్తిని విస్మరించిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై స్పష్టమైన హామీ రాకపోతే.. ఢిల్లీ స్థాయిలో ఉద్యమించాలని పిలుపు ఇచ్చారు. హైదరాబాద్‌లో 10 వేల మందితో మహాధర్నా నిర్వహిస్తామని కోదండరాం స్పష్టం చేశారు.

Updated Date - 2020-02-22T20:46:11+05:30 IST