ఏపీ జలదోపిడీపై చర్చకు సిద్ధమా?: వంశీచంద్‌

ABN , First Publish Date - 2020-08-09T08:03:43+05:30 IST

ఏపీ జలదోపిడీని అరికట్టడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. ఈ విషయమై బహిరంగ చర్చకు సిద్ధమా? అని శనివారం ఓ ప్రకటనలో టీఆర్‌ఎస్‌ నేతలకు సవాల్‌ విసిరా...

ఏపీ జలదోపిడీపై చర్చకు సిద్ధమా?: వంశీచంద్‌

హైదరాబాద్‌, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ఏపీ జలదోపిడీని అరికట్టడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. ఈ విషయమై బహిరంగ చర్చకు సిద్ధమా? అని శనివారం ఓ ప్రకటనలో టీఆర్‌ఎస్‌ నేతలకు సవాల్‌ విసిరారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏపీలో పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు చేపట్టిన కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలని డిమాండ్‌ చేశారు. 


అంబేడ్కర్‌ విగ్రహం ఏమైంది: రాములునాయక్‌

సీఎం కేసీఆర్‌ గతంలో ప్రకటించిన 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ఏమైందని మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌ ప్రశ్నించారు. సచివాలయం కట్టేందుకు రూ.400 కోట్లు కేటాయించిన కేసీఆర్‌.. అంబేడ్కర్‌ విగ్రహానికి రూపాయి కూడా ఇవ్వరా? అని నిలదీశారు

Updated Date - 2020-08-09T08:03:43+05:30 IST