Telangana: రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 705 కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-08-01T04:20:34+05:30 IST

తెలంగాణ (Telangana)లో కరోనా (Corona) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ..

Telangana: రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 705 కరోనా కేసులు

హైదరాబాద్ (Hyderabad): తెలంగాణ (Telangana)లో కరోనా (Corona) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో పాజిటివ్ (Positive) కేసులు మరింత పెరిగాయి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 705 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒక్క హైదరాబాద్‎లోనే 355 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,543 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని రాష్ట్ర వైద్యాధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని చెప్పారు. మళ్లీ కరోనా పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. వర్షాల కురుస్తున్న నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు పేర్కొన్నారు. 


Updated Date - 2022-08-01T04:20:34+05:30 IST