నేడు నల్లగొండలో గవర్నర్ తమిళిసై పర్యటన
ABN , First Publish Date - 2021-12-08T13:32:35+05:30 IST
గవర్నర్ డా.తమిళిసై సౌందర రాజన్ ఈరోజు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:15 గంటలకు జిల్లా కేంద్రంలోని ఆర్అండ్ బీ అతిథి గృహానికి గవర్నర్ చేరుకోనున్నారు.
నల్లగొండ: గవర్నర్ డా.తమిళిసై సౌందర రాజన్ ఈరోజు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:15 గంటలకు జిల్లా కేంద్రంలోని ఆర్అండ్ బీ అతిథి గృహానికి గవర్నర్ చేరుకోనున్నారు. ఉదయం 11:35 గంటలకు పట్టణంలోని షేర్ బంగ్లాలో భక్తాంజనేయ సహిత సంతోషిమాత దేవాలయాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2:30 గంటల మధ్యలో ఆర్జాలబావి, ఏ దుప్పలపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గవర్నర్ సందర్శించనున్నారు. అనంతరం 3 గంటలకు గవర్నర్ తమిళిసై తిరిగి హైదరాబాద్కు పయనం కానున్నారు.