నల్లగొండకు చేరుకున్న గవర్నర్ తమిళిసై సౌందర రాజన్
ABN , First Publish Date - 2021-10-07T17:13:29+05:30 IST
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కొద్దిసేపటి క్రితం జిల్లాకు చేరుకున్నారు.
నల్లగొండ: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కొద్దిసేపటి క్రితం జిల్లాకు చేరుకున్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో పట్టణంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్కు చేరుకున్న గవర్నర్కు అధికారులు స్వాగతం పలికారు. పోలీస్ పరేడ్ గౌరవ వందనాన్ని గవర్నర్ తమిళిసై స్వీకరించారు.