‘తెలంగాణలో కరోనా పూర్తిస్థాయిలో నియంత్రణలో ఉంది’

ABN , First Publish Date - 2020-08-08T22:00:21+05:30 IST

తెలంగాణలో పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయని హెల్త్ డైరెక్టర్‌ శ్రీనివాసరావు చెప్పారు. సెప్టెంబర్‌ నెలాఖరుకు తెలంగాణలో కరోనా పూర్తిస్థాయిలో నియంత్రణలో ఉంటుందన్నారు.

‘తెలంగాణలో కరోనా పూర్తిస్థాయిలో నియంత్రణలో ఉంది’

హైదరాబాద్: తెలంగాణలో పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయని హెల్త్ డైరెక్టర్‌ శ్రీనివాసరావు చెప్పారు. సెప్టెంబర్‌ నెలాఖరుకు తెలంగాణలో కరోనా పూర్తిస్థాయిలో నియంత్రణలో ఉంటుందన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 5 శాతం పాజిటివ్‌ రేటు నమోదయిందని పేర్కొన్నారు. కరోనా నివారణ చర్యలకు మరో రూ.100 కోట్లు కేటాయించారని చెప్పారు. కరోనా రెండు వారాలు మాత్రమే ఉండే జబ్బు అని పేర్కొన్నారు. 1100 కేంద్రాల్లో రోజుకు 20 వేలకుపైగా కరోనా టెస్టులు చేస్తున్నారని తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారికి హోం ఐసోలేషన్ కిట్ ఇస్తున్నామని చెప్పారు. హోం ఐసోలేషన్ రోగులను మానిటరింగ్ చేస్తున్నామని పేర్కొన్నారు. 

Updated Date - 2020-08-08T22:00:21+05:30 IST