Telanganaలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ
ABN , First Publish Date - 2021-11-22T17:35:16+05:30 IST
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. వ్యాక్సినేషన్పై ప్రభుత్వం తీరును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. వ్యాక్సినేషన్పై ప్రభుత్వం తీరును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాష్ట్రంలో పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ అందడంలేదంటూ పిటిషనర్ తరపు న్యాయవాది మాచర్ల రంగయ్య హైకోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో మొబైల్ వాహనాల ద్వారా వ్యాక్సినేషన్ ప్రజలకు అందించాలని ధర్మాసనం సూచించింది. వ్యాక్సినేషన్పై అవగాహన కల్పించేలా ప్రచారాలు చేయాలని పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.