ప్రత్యక్ష విచారణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ABN , First Publish Date - 2021-07-31T23:46:03+05:30 IST
కోర్టులో ప్రత్యక్ష విచారణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగస్టు 9
హైదరాబాద్: కోర్టులో ప్రత్యక్ష విచారణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగస్టు 9 నుంచి పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 9 వరకు ప్రత్యక్ష విచారణ జరుగనుంది. రోజూ ఒక ధర్మాసనం, ఒక సింగిల్ బెంచ్ ప్రత్యక్ష విచారణ జరుపుతాయని హైకోర్టు పేర్కొంది. వ్యాక్సిన్ వేసుకున్న న్యాయవాదులకే ప్రత్యక్ష విచారణకు అనుమతి ఉంటుందని హైకోర్టు తెలిపింది. కేసు ఉన్న న్యాయవాదులు మాత్రమే విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టులో ఆగస్టు 8 వరకు ఆన్లైన్లోనే విచారణ కొనసాగనుంది.