ఆ కాలేజీలను మూసివేస్తాం: ఇంటర్ బోర్డు కార్యదర్శి
ABN , First Publish Date - 2020-02-23T00:12:46+05:30 IST
నిబంధనలు పాటించని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ హెచ్చరించారు. శనివారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన..
హైదరాబాద్: నిబంధనలు పాటించని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ హెచ్చరించారు. శనివారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఇప్పటికే కాలేజీలల్లో తనిఖీలు పూర్తి చేశామన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నిబంధనలు పాటించకపోతే కాలేజీలను మూసివేస్తామని హెచ్చరించినట్లు జలీల్ చెప్పారు. ఈ విద్యా సంవత్సరానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. 79 కాలేజీలకు ఫైర్ సేఫ్టీ అనుమతులు లేవని జలీల్ తెలిపారు. సదరు కాలేజీలను అన్ని వసతులు ఉన్న భవనాల్లోకి మార్చాలని అన్నారు.