పాత పద్థతినే అనుసరిస్తున్న తెలంగాణ

ABN , First Publish Date - 2020-08-02T15:23:54+05:30 IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది.

పాత పద్థతినే అనుసరిస్తున్న తెలంగాణ

హైదరాబాద్: తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. అటు మరణాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం పాత పద్ధతినే అనుసరిస్తోంది. ఒక్కనెలలోనే భారీగా కేసులు నమోదయ్యాయి. జులై నెలలో కరోనా విజృంభించింది. 30 రోజుల్లో ఏకంగా 46వేల కేసులు నమోదయ్యాయి. రోజుకు సగటున 1533 మందికి పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. 259 మంది చనిపోయారు. అంటే రోజుకు సగటున 8 మంది మృతి చెందారు. 


రాష్ట్రంలో జూన్, జులై నెలలోనే 59,641 కేసులు నమోదు కావడం గమనార్హం. తాజాగా రాష్ట్రంలో ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదయ్యాయి. బుధవారం రాత్రి 8 గంటల నుంచి  గురువారం రాత్రి 8 గంటల మధ్య 1986 మంది వైరస్ బారిన పడ్డారు. జులై 8న 1924 కేసులు వచ్చాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు 62,703కు చేరాయి. మరో 14 మంది మృతితో మరణాలు 519 అయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో జులై నెలలో 26,082 మందికి కరోనా సోకింది. కాగా రాష్ట్రంలో ఒక్క రోజే రికార్డు స్థాయిలో 21,380 టెస్టులు నిర్వహించారు. దీంతో పరీక్షల సంఖ్య 4,37,582కు చేరింది.

Updated Date - 2020-08-02T15:23:54+05:30 IST