మా ఊరి నుంచి వెళ్లొద్దు.. తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో కంపచెట్లతో..

ABN , First Publish Date - 2020-05-22T16:10:35+05:30 IST

తెలంగాణ- కర్ణాటక సరిహద్దు గ్రామం కంసాన్‌పల్లి(బి) గ్రామం మీదుగా కర్ణాటక ప్రాంతం సోంపల్లివాసులు రాకపోకలు సాగిస్తుండటంతో ఈ దారిని గురు వారం మూసేశారు.

మా ఊరి నుంచి వెళ్లొద్దు.. తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో కంపచెట్లతో..

కంపచెట్లతో తెలంగాణ-కర్ణాటక సరిహద్దు దారి మూసివేత 


బషీరాబాద్‌ (వికారాబాద్): తెలంగాణ- కర్ణాటక సరిహద్దు గ్రామం కంసాన్‌పల్లి(బి) గ్రామం మీదుగా కర్ణాటక ప్రాంతం సోంపల్లివాసులు రాకపోకలు సాగిస్తుండటంతో ఈ దారిని గురు వారం మూసేశారు. మైల్వార్‌ గ్రామం వద్ద చెక్‌పోస్టు ఉండటంతో, ఎడ్లబండ్ల బాట మార్గం నుంచి కర్ణాటక ప్రాంత సోంపల్లి వాసులు నిత్యం కాలినడకన, ద్విచక్ర వాహనాలపై రాకపోకలు సాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందుతున్నందున సరిహద్దులో రాకపోకలపై పోలీ సులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఐ కె.గిరి స్థానిక సర్పంచ్‌ వెంకటయ్యకు సరిహద్దు దారి మూసి వేయించాలని సూచించారు. 

Updated Date - 2020-05-22T16:10:35+05:30 IST