కేసీఆర్‌ కృషితోనే తెలంగాణ సస్యశ్యామలం: హరీష్‌రావు

ABN , First Publish Date - 2021-10-18T01:28:59+05:30 IST

తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్‌ చొరవతో కాళేశ్వరం నీళ్లు వచ్చి రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని మంత్రి హరీష్‌రావు అన్నారు.

కేసీఆర్‌ కృషితోనే తెలంగాణ సస్యశ్యామలం: హరీష్‌రావు

వీణవంక: తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్‌ చొరవతో కాళేశ్వరం నీళ్లు వచ్చి రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆదివారం మీడియాతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అంటేనే పేదల సంక్షేమ కోసం పనిచేస్తున్న ప్రభుత్వమన్నారు. పేద ప్రజల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈటల రాజేందర్‌కు కేసీఆర్‌ నాలుగు వేల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తే పేదల మీద ప్రేమ లేకనే కట్టించలేదని విమర్శించారు. గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి పేదల ప్రజల నడ్డి విరుస్తున్న బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే పేదల ఖాతాల్లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందని హరీష్‌రావు మండిపడ్డారు.

Updated Date - 2021-10-18T01:28:59+05:30 IST