ఏడాది పూర్తి చేసుకున్న తెలంగాణ మహిళా కమిషన్

ABN , First Publish Date - 2022-01-18T21:51:50+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాటు చేసిన తెలంగాణ మహిళా కమిషన్ ఏడాది పూర్తిచేసుకుంది.

ఏడాది పూర్తి చేసుకున్న తెలంగాణ మహిళా కమిషన్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాటు చేసిన తెలంగాణ మహిళా కమిషన్ ఏడాది పూర్తిచేసుకుంది. ఈ మేరకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు కమిషన్ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 19వ తేదీన ఉదయం 11గంటలకు మహిళా కమిషన్ కార్యాలయంలో జరిగే కార్యక్రమాలకు మహిళా, శిశు సంఓమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ హాజరు కానున్నారు. 


ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు షహీన్ అఫ్రోజ్, కుమ్రఈశ్వరిబాయ్, కొమ్ము ఉమాదేవియాదవ్, గడ్డలా పద్మ, సుధాం లకిమి, కటారి రేవతిరావు తదితరులు పాల్గొంటారు. ఈ సందర్భంగా కమిషన్ వార్షిక నివేదికను సమర్పించడంతో పాటు కేలండర్ ఆవిష్కరించనున్నారు. వీటితో పాటు మహిళా సాధికారత పై కమిషన్ రూపొందించిన ప్రత్యేక పాటను ఆవిష్కరించనున్నారు. 

Updated Date - 2022-01-18T21:51:50+05:30 IST