ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో తెలంగాణ కళాఖండం

ABN , First Publish Date - 2022-01-26T09:32:08+05:30 IST

ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో రాష్ట్రానికి చెందిన కళాకారులు రూపొందించిన కళాఖండాన్ని ప్రదర్శించనున్నారు.

ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో తెలంగాణ కళాఖండం

ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో రాష్ట్రానికి చెందిన కళాకారులు రూపొందించిన కళాఖండాన్ని ప్రదర్శించనున్నారు. నేషనల్‌ ఆర్ట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రం నుంచి అన్నరపు నరేందర్‌ ఆధ్వర్యంలో ఎనిమిది మంది కళాకారుల బృందం ఈ కళాఖండాన్ని తీర్చిదిద్దింది. ఇందులో నిజాం నవాబు నాటి కేంద్ర హోం మంత్రి సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ ఎదుట లొంగిపోయిన సన్నివేశం, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పొందుపరిచారు. ఈ కళాఖండం గణతంత్ర వేడుకల్లో నిర్వహించే ప్రదర్శనకు ఎంపికైనట్లు నరేందర్‌ తెలిపారు. ఈ కళాఖండం రూపకల్పనలో కళాకారులు పి.నరేశ్‌ కుమార్‌, కంది నర్సింహులు, గుర్రం మల్లేశ్‌, ఎ.వెంకటేశ్వర్లు, జి.శివకుమార్‌, జె.ప్రమోద్‌రెడ్డి, మహేశ్‌ పాల్గొన్నట్లు తెలిపారు.                -రాంనగర్‌ 

Updated Date - 2022-01-26T09:32:08+05:30 IST