షాపూర్జీ పల్లోంజికి ఒప్పంద పత్రం అందజేత
ABN , First Publish Date - 2020-10-30T03:02:01+05:30 IST
తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణ పనులను ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్ జీ పల్లోంజి కంపెనీ దక్కించుకున్న విషయం తెలిసింది. ఈ మేరకు గురువారం సాయంత్రం షాపూర్ జీ పల్లోంజి ..
హైదరాబాద్: తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణ పనులను ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్ జీ పల్లోంజి కంపెనీ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం సాయంత్రం షాపూర్ జీ పల్లోంజి సంస్థకు ఆర్అండ్బీశాఖ అంగీకార పత్రాన్నిఅందజేసింది. సచివాలయ నిర్మాణ పనులకు రూ. 494 కోట్లకు టెండర్ పిలువగా 4 శాతం ఎక్కువకు షాపూర్ జీ పల్లోంజి కోట్ చేసింది. 12 నెలల్లోపు పనులు పూర్తి చేయాలని టెండర్లో ప్రభుత్వ షరతులు విధించింది.
కాగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న పాత సచివాలయాన్ని ప్రభుత్వం కూల్చి వేసిన విషయం తెలిసిందే. కొత్త సచివాలయాన్ని నిర్మించేందుకు ఇప్పటికే డిజైన్లను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ సచివాలయంలో ఆరు అంతస్తులు ఉండనున్నాయి. సుమారు రూ.494 కోట్లతో 6 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయాన్ని నిర్మించనున్నారు. ఈ భవన నిర్మాణ పనులను షాపూర్ జీ పల్లోంజి సంస్థ దక్కించుకుంది.