ఆబ్కారీ పోలీస్ స్టేషన్లో గుండెపోటుతో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-08-02T02:47:41+05:30 IST
ఆబ్కారీ పోలీస్ స్టేషన్లో గుండెపోటుతో వ్యక్తి మృతి
మంచిర్యాల: జిల్లాలోని లక్షెట్టిపేటలో దారుణం చోటుచేసుకుంది. గుడుంబా తయారీ కేసులో ఆకుల శ్రీనివాస్ అనే వ్యక్తిని ఆబ్కారీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆబ్కారీ పోలీస్ స్టేషన్లోనే శ్రీనివాస్కు గుండెపోటు వచ్చింది. పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందాడు. మృతదేహంతో ఆబ్కారీ స్టేషన్ ముందు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మృతుని స్వగ్రామంలక్షెట్టిపేట మండలం దౌడపల్లి వాసి.