చెరువులో పడి తండ్రికొడుకు మృతి

ABN , First Publish Date - 2020-08-09T16:14:30+05:30 IST

చెరువులో పడి తండ్రికొడుకు మృతి

చెరువులో పడి తండ్రికొడుకు మృతి

భూపాలపల్లి: మొగుళ్లపల్లి మండలం పర్లపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. చెరువులో పడి తండ్రి ఓదెలు(70), కొడుకు మధుకర్‌(25) మృతి చెందారు. చెరువులో పడి ఆ ఇద్దరు చనిపోయిన విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మ‌ృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2020-08-09T16:14:30+05:30 IST