కార్వీ కేసులో దూకుడు పెంచిన ఈడీ
ABN , First Publish Date - 2022-01-24T16:27:53+05:30 IST
కార్వీ కేసులో దూకుడు పెంచిన ఈడీ
హైదరాబాద్: కార్వీ కేసులో ఈడీ దూకుడు పెంచింది. కార్వీ ఎండీ పార్థసారథిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. సీసీఎస్లో నమోదైన కేసుల ఆధారంగా అరెస్ట్ చేశారు. షేర్ మార్కెట్లో పెట్టుబడుల పేరిట కార్వీ మోసాలకు పాల్పడ్డారు. కస్టమర్ల షేర్లు తనఖా పెట్టి ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి..రూ.500 కోట్లు రుణం పొంది చెల్లించకుండా ఎగ్గొట్టారని అభియోగాలు ఉన్నాయి. స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ద్వారా కష్టమర్లు షేర్లు కొనుగోలు చేశారు. నిధులను తన స్వంత అకౌంట్లకు కార్వీ సంస్థ ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లు గుర్తించారు.