దేశంలోనే తెలంగాణ నెంబర్వన్
ABN , First Publish Date - 2021-01-17T04:25:47+05:30 IST
దేశంలోనే తెలంగాణ నెంబర్వన్
- మంత్రి చామకూర మల్లారెడ్డి
ఘట్కేసర్: తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్వన్ అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం లో ఏ రాష్ట్రంలోనూ లేని సంక్షేమ పఽథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆడపిల్లల వివాహాలకు రూ.లక్షా 116 కానుకగా అందిస్తున్నట్లు తెలిపారు. కార్పోరేట్ వైద్యం చేయించుకున్న అనేకమందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళుతోందని గుర్తుచేశారు. ప్రపంచాన్ని కలవర పెడుతున్న కరోనా మహమ్మారి నియత్రించే వ్యాక్సిన్లు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు నాలుగు అందుబాటులోకి రాగా అందులో ఒక వ్యాక్సిన్ భారత్ బయోటెక్ నుంచి తయారుకావడం గర్వకారణమని అన్నారు. ఈ సందర్బంగా ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీలతోపాటు మండల వ్యాప్త గ్రామాలకు చెందిన 60 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, ఎంపీపీ సుదర్శన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్లు ముల్లి పావని జంగయ్యయాదవ్, బోయపల్లి కొండల్రెడ్డి, వైస్చైర్మన్ రెడ్డియానాయక్ పాల్గొన్నారు.