Telangana: పెద్దపల్లి జిల్లాలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2022-01-19T13:22:46+05:30 IST

జిల్లాలో కరోనా కోరలు చాస్తోంది. నిన్న ఒక్కరోజే 471 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.

Telangana: పెద్దపల్లి జిల్లాలో కరోనా కలకలం

పెద్దపల్లి: జిల్లాలో కరోనా కోరలు చాస్తోంది. నిన్న ఒక్కరోజే 471 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. గోదావరిఖని ప్రాంతంలోనే ఎక్కువగా 226 మందికి కరోనా అని తేలింది. కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. 


Updated Date - 2022-01-19T13:22:46+05:30 IST