తెలంగాణ స్పీకర్ Pocharamకు కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2021-11-25T17:04:35+05:30 IST
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కరోనా బారిన పడ్డారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. రెగ్యులర్ మెడికల్ టెస్ట్లలో భాగంగా నిన్న రాత్రి చేయించిన కోవిడ్ టెస్ట్లో తనకు కరోనా పాజిటివ్ అని నమోదు అయినట్లు స్పీకర్ తెలిపారు. ప్రస్తుతం తనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు ఏఐజీ, గచ్చిబౌలి హాస్పిటల్లో జాయిన్ అయ్యానని చెప్పారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన, సన్నిహితంగా ఉన్న వారు కోవిడ్ టెస్ట్ చేయించుకుని తగు జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్లో ఉండాలని స్పీకర్ పోచారం వినతి చేశారు. ఇటీవల పోచారం మనవరాలి పెళ్లికి ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ హాజరైన విషయం తెలిసిందే.