తెలంగాణను ప్రత్యేక దేశంగా ప్రకటించాలి!
ABN , First Publish Date - 2021-11-14T00:40:51+05:30 IST
సవాళ్లు, ప్రతి సవాళ్లతో తెలంగాణలో రైస్ వార్ ముదురుతోంది. కేంద్రం తీరును తప్పుపడుతూ టీఆర్ఎస్ నాయకుడు ఏకంగా....
రాజన్న సిరిసిల్ల: సవాళ్లు, ప్రతి సవాళ్లతో తెలంగాణలో రైస్ వార్ ముదురుతోంది. కేంద్రం తీరును తప్పుపడుతూ టీఆర్ఎస్ నాయకుడు ఏకంగా తెలంగాణను ప్రత్యేకంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. యాసంగి ధ్యాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోతే తమ రాష్ట్రాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని టీఆర్ఎస్ జెడ్పీటీసీ నాగం భూమయ్య అన్నారు. నాగం భూమయ్యది రాజన్న సిరిసిల్ల జిల్లా. కదలాపూర్లో భూమయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి.