శ్రీనివాస్‌రెడ్డి గెలిస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది: రేవంత్‌

ABN , First Publish Date - 2020-10-30T02:18:01+05:30 IST

ఏడేళ్ల పాలనలో ఒక్క హామీని కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నెరవేర్చలేదని ఎంపీ రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. నాలుగు సార్లు గెలిచిన రామలింగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదని

శ్రీనివాస్‌రెడ్డి గెలిస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది: రేవంత్‌

సిద్దిపేట: ఏడేళ్ల పాలనలో ఒక్క హామీని కూడా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నెరవేర్చలేదని ఎంపీ రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. నాలుగు సార్లు గెలిచిన రామలింగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదని, ఆయన కొడుకుకు కూడా టికెట్‌ ఇస్తామని ఇవ్వలేదని తప్పుబట్టారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి గెలిస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందన్నారు. బీసీ- డి నుంచి ముదిరాజ్‌లను బీసీ-ఎకు కాకుండా సీఎం కేసీఆర్‌ చేశారని, కేసీఆర్‌కు దుబ్బాక ప్రజలే బుద్ధిచెప్పాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనే హాట్‌టాపిక్‌గా మారిన దుబ్బాక ఉప ఎన్నికను టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సోలిపేట సుజాత, కాంగ్రెస్‌ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ పార్టీ నుంచి మాధవనేని రఘునందన్‌రావు పోటీలో ఉన్నారు. 

Updated Date - 2020-10-30T02:18:01+05:30 IST