టెక్నాలజీ ఉపయోగించుకోవడంలో తెలంగాణ ముందుంది: కేటీఆర్
ABN , First Publish Date - 2020-08-09T01:16:37+05:30 IST
టెక్నాలజీ ఉపయోగించుకోవడంలో తెలంగాణ ముందుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆర్టిఫిషియల్, డ్రోన్, బ్లాక్ చైన్, క్లౌడ్ టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్: టెక్నాలజీ ఉపయోగించుకోవడంలో తెలంగాణ ముందుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆర్టిఫిషియల్, డ్రోన్, బ్లాక్ చైన్, క్లౌడ్ టెక్నాలజీలను ఉపయోగిస్తున్నామని చెప్పారు. రి ఇన్వెంటింగ్ టెక్నాలజీ ఇన్ ఇండియా సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 5జీ సేవలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. దేశానికి ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్ అవసరమన్నారు. కోవిడ్ కారణంగా రిమోట్ వర్కింగ్ డిజిటల్ సొల్యూషన్కు అవకాశం ఏర్పడిందని, తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ప్రారంభించామని కేటీఆర్ పేర్కొన్నారు.