మహిళా కమిషన్‌ను నియమించండి

ABN , First Publish Date - 2020-02-28T10:50:18+05:30 IST

తెలంగాణలో రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ను నియమించాలని జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) సూచించింది. ఈ మేరకు ..

మహిళా కమిషన్‌ను నియమించండి

  • తెలంగాణకు జాతీయ కమిషన్‌ సూచన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: తెలంగాణలో రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ను నియమించాలని జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చొరవ తీసుకోవాలని తెలిపింది. 2018 నుంచి రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పోస్టు ఖాళీగా ఉందని, దీంతో మహిళలకు సంబంధించిన అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేకపోతున్నాయని ఎన్‌సీడబ్ల్యూ పేర్కొంది. ఇటీవల రాష్ట్రంలో పలువురు మహిళలపై దారుణమైన అఘాయిత్యాలు జరిగాయని, అయినా మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేయకపోవడం ఆమోదయోగ్యం కాదని ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ అన్నారు. ఇదే అంశంపై గతంలో సీఎం కేసీఆర్‌కు లేఖ కూడా రాసినట్లు ఆమె పేర్కొన్నారు.

Updated Date - 2020-02-28T10:50:18+05:30 IST