‘జోహార్‌ వైఎస్సార్‌.. జై తెలంగాణ’ అంటూ షర్మిల ప్రసంగం

ABN , First Publish Date - 2021-04-10T02:25:41+05:30 IST

ఖమ్మం సంకల్స సభలో షర్మిల ఉద్విగానికి గురయ్యారు. జోహార్‌ వైఎస్సార్‌.. జై తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని

‘జోహార్‌ వైఎస్సార్‌.. జై తెలంగాణ’ అంటూ షర్మిల ప్రసంగం

ఖమ్మం: ఖమ్మం సంకల్స సభలో షర్మిల ఉద్విగానికి గురయ్యారు. ‘జోహార్‌ వైఎస్సార్‌.. జై తెలంగాణ’ అంటూ తన ప్రసంగాన్ని షర్మిల ప్రారంభించారు. ఉద్యమాల గుమ్మం.. ఖమ్మం అని కొనియాడారు. ‘‘వైఎస్‌ను అభిమానించే ప్రతి గుండెకు నమస్కారం. 18 ఏళ్ల క్రితం ఇదే రోజు వైఎస్‌ పాదయాత్ర ప్రారంభించారు. వైఎస్‌ పాదయాత్రలో రైతుల కష్టాలు తెలుసుకున్నారు. ఏ నాయకుడు చేయని సాహసం వైఎస్సార్‌ చేశారు. ప్రజలతో మమేకమైన మహానేత వైఎస్సార్‌. జలయజ్ఞం, ఉచిత విద్యుత్‌, ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు. రాజన్న అడుగుజాడల్లో నడుస్తాను. రాజన్న సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తాను. రాజకీయ పార్టీ పెట్టబోతున్నాను. పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముందో కూడా వివరిస్తాను. వ్యవసాయాన్ని పండుగ చేయాలని వైఎస్‌ కోరుకున్నారు. వైఎస్‌.. లక్షలాది మంది రైతుల్ని రుణ విముక్తుల్ని చేశారు’’ అని షర్మిల గుర్తుచేశారు.

Updated Date - 2021-04-10T02:25:41+05:30 IST