దేవినేని అరెస్టుపై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం

ABN , First Publish Date - 2021-07-29T06:28:07+05:30 IST

టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేనిపై వైసీపీ గూండాల దాడి, పోలీసుల అరెస్టు చర్యలను తీవ్ర ఖండిస్తున్నామని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేవినేని అరెస్టుపై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం
అంబేడ్కర్‌ సర్కిల్‌లో ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులు

హిందూపురం, జూలై 28: టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేనిపై వైసీపీ గూండాల దాడి, పోలీసుల అరెస్టు చర్యలను తీవ్ర ఖండిస్తున్నామని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపల్లి అక్రమ మైనింగ్‌ పరీశీలించి వస్తున్న దేవినేని ఉమామహేశ్వరరావుపై దాడిచేసిన వారిని అరెస్టు చేయాలంటూ బుధవారం హిందూపురం టీడీపీ ఆధ్యర్యంలో అంబేడ్కర్‌ సర్కిల్‌లో నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ వైసీపీ నిరకుంశ పాలనతో ప్రభుత్వ అవినీతి అక్రమాలు బయట పెడితే తట్టుకోలేక వైపీపీ గుండా రాజకీయాలకు పాల్పడుతోందనిన్నారు. ఇటీవల ప్రతి పక్షనాయకుల, దళితులపై దాడులు చేయడం అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారన్నారు. ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిపోయి పెట్టుబడులు రాక పరిశ్రమలు పరిపోతున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన ప్రభుత్వ పాలనపై దృష్టి పెట్టకుండా ప్రతీకారంపై దృష్టి సారిస్తున్నారు. దేవినేనిపై దాడిచేసిన వైసీపీ గుండాలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేవారు. ఈనిరసన కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్‌ ప్రదాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామాంజినమ్మ, షఫీవుల్లా, పార్లమెంట్‌ మీడియా కోఆర్టినేటర్‌ చంద్రమోహన, టీడీపీ నాయకులు రమేష్‌, అమర్‌నాథ్‌, ఆదినారాయణ, కౌన్సిలర్లు రాఘవేంద్ర, మంజుల, భారతి, మహలక్ష్మీ, నాయకులు హెచ.రాము, డైమండ్‌ బాబా, దుర్గానవీన, శ్రీనివాసరెడ్డి, నబీరసూల్‌, హిదయతూల్లా, శివకుమార్‌, టైలర్‌ గంగాధర్‌, భాషా, నాగేంద్ర, హరీ్‌షకుమార్‌, శ్రీనివాసులు, తెలుగు మహిళ మహిళ విభాగం నాయకురాళ్లు మాలక్క, శాంతమ్మ, విజయలక్ష్మీ శశికళ, పరిమళ పాల్గొన్నారు.


Updated Date - 2021-07-29T06:28:07+05:30 IST