బాలు అంత్యక్రియలు... చర్చనీయాంశంగా మారిన తెలుగు సినీ ప్రముఖుల గైర్హాజరు..!

ABN , First Publish Date - 2020-09-27T18:50:32+05:30 IST

ప్రముఖ సినీ నేపధ్య గాయకుడు ఎస్పీ బాలు అంత్యక్రియలు చెన్నైలో ముగిశాయి. అయితే... సినీ పరిశ్రమకు చెందిన అతి కొద్దిమంది మాత్రమే బాలు మృతదేహాన్ని చూసేందుకు వచ్చారు. ప్రత్యేకించి... హైదరాబాద్ నుంచి తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులెవరూ వెళ్ళకపోవడం గమనార్హం. తమ సంతాప సందేశాలను మాత్రం సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా నివాళులర్పించారు.

బాలు అంత్యక్రియలు... చర్చనీయాంశంగా మారిన తెలుగు సినీ ప్రముఖుల గైర్హాజరు..!

చెన్నై : ప్రముఖ సినీ నేపధ్య గాయకుడు ఎస్పీ బాలు అంత్యక్రియలు చెన్నైలో ముగిశాయి. అయితే... సినీ పరిశ్రమకు చెందిన అతి కొద్దిమంది మాత్రమే బాలు మృతదేహాన్ని చూసేందుకు వచ్చారు. ప్రత్యేకించి...  హైదరాబాద్ నుంచి తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులెవరూ వెళ్ళకపోవడం గమనార్హం.  తమ సంతాప సందేశాలను మాత్రం సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా నివాళులర్పించారు.


ఇక... తమిళ చిత్ర పరిశ్రమ నుంచి కమలహాసన్... చివరిసారిగా  బాలుని ఆస్పత్రిలో చూసి వెళ్లిపోయారు. ఆయన మృతదేహాన్ని చూసి తాను తట్టుకోలేనని, అందుకే అంత్యక్రియలకు రాలేకపోయానని ఆయన చెప్పారు. ఇక రజినీకాంత్ కూడా... బాలుని ఆ స్థితిలో చూడలేనంటూ ఇంట్లోనే ఉండిపోయారు. తమిళ సినీ పరిశ్రమ నుంచి స్టార్ హీరోల్లో విజయ్ మాత్రమే బాలు అంత్యక్రియలకు హాజరయ్యారు.


కాగా... కరోనా భయంతోపాటు సినీ ప్రముఖులు చెన్నై వెళితే... భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని, ఈ క్రమంలోనే... వారు చెన్నై వెళ్లలేదని చెబుతున్నారు. మొత్తంమీద... బాలు అంత్యక్రియలకు తెలుగు సినీ ప్రముఖులెవరూ పెద్దగా హాజరు కాకపోవడం అటు పరిశ్రమ వర్గాల్లోనూ, ఇటు అభిమానులు, సామాన్య ప్రజల్లోనూ తారస్థాయిలో చర్చనీయాంశమైంది. 

Updated Date - 2020-09-27T18:50:32+05:30 IST