మిస్ యూనివర్స్ సింగపూర్గా తెలుగమ్మాయి
ABN , First Publish Date - 2021-09-18T19:22:35+05:30 IST
మిస్ యూనివర్స్ సింగపూర్-2021 కిరీటాన్ని తెలుగమ్మాయి నందితా బన్న కైవసం చేసుకున్నారు.
కిరీటం కైవసం చేసుకున్న తెలుగు యువతి
సింగపూర్: మిస్ యూనివర్స్ సింగపూర్-2021 కిరీటాన్ని తెలుగమ్మాయి నందితా బన్న కైవసం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి నిర్వాహకులు వెల్లడించిన ఫలితాల్లో ఆమె మొదటి స్థానంలో నిలిచారు. నేషనల్ మ్యూజియమ్ సింగపూర్లో నిర్వహించిన ఈ పోటీల్లో టైటిల్ కోసం 8మంది యువతులు తుదిపోటీలో నిలవగా వారందరినీ వెనక్కునెట్టి 21 ఏళ్ల నందిత కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. నందిత తల్లిదండ్రులు గోవర్ధన్, మాధురిల స్వస్థలం శ్రీకాకుళం.