నడకుదిటికి తెలుగు మహిళ నివాళి
ABN , First Publish Date - 2021-04-09T07:07:16+05:30 IST
బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు చేసిన సేవలు మరచిపోలేమని మచిలీపట్నం తెలుగు మహిళ అధ్యక్షురాలు లంకిశెట్టి నీరజ అన్నారు.
మచిలీపట్నం టౌన్, ఏప్రిల్ 8 : బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు చేసిన సేవలు మరచిపోలేమని మచిలీపట్నం తెలుగు మహిళ అధ్యక్షురాలు లంకిశెట్టి నీరజ అన్నారు. టీడీపీ పట్టణ కార్యా లయంలో గురువారం మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు సంతాప సభ జరిగింది. తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంతాప సభలో లంకిశెట్టి నీరజ ప్రసంగిం చారు. మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద దిక్కును కోల్పోయిందన్నారు. నడకుదిటి లేని లోటు భర్తీ చేయడం చాలా కష్టమన్నారు. మహిళలను రాజకీయాల్లో ప్రోత్సహించిన ఘనత నడకుదిటికే దక్కిందన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారన్నారు. కార్పొరేటర్ సమతాకీర్తి, తెలుగు మహిళలు బచ్చుల కల్పన, బొడ్డు నాగలక్ష్మి, మురాల సుధాలక్ష్మి, కరెడ్ల సుశీల, పద్మజ, శ్రీదేవి, వాణి, లతీఫున్నీసా తదితరులు పాల్గొన్నారు.