ఒమ‌న్‌లో గుండెపోటుతో తెలుగు వ్య‌క్తి మృతి !

ABN , First Publish Date - 2020-08-23T16:35:42+05:30 IST

గ‌ల్ఫ్ దేశ‌మైన ఒమ‌న్‌లో ఓ తెలుగు వ్య‌క్తి గుండెపోటుతో మృతి చెందాడు.

ఒమ‌న్‌లో గుండెపోటుతో తెలుగు వ్య‌క్తి మృతి !

మ‌స్క‌ట్: గ‌ల్ఫ్ దేశ‌మైన ఒమ‌న్‌లో ఓ తెలుగు వ్య‌క్తి గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు మాల‌వ‌త్ పాండ్యా(33)ది నిజామాబాద్ జిల్లా ధ‌ర్ప‌ల్లి మండ‌లం రేకుల‌ప‌ల్లి. ఒమ‌న్‌లోని స‌లాల ప్రాంతంలో ఉన్న అల్ నాస‌ర్ అల్ అరేబియా సంస్థ‌లో ప‌ని చేస్తున్నాడు. ఈ క్ర‌మంలో రెండు రోజుల క్రితం గుండెపోటుతో మ‌ర‌ణించాడు. దీంతో శ‌నివారం పాండ్యా కుటుంబ స‌భ్యుల‌కు ఒమ‌న్ నుంచి అధికారులు ఫోన్ ద్వారా ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు. దీంతో కుటుంబ స‌భ్యులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. మృతదేహాన్ని త్వ‌ర‌గా స్వ‌దేశానికి ర‌ప్పించాల‌ని వారు కోరుతున్నారు. మృతుడికి భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. పాండ్యా మృతితో రేకుల‌ప‌ల్లిలో విషాదం నెల‌కొంది. 

Updated Date - 2020-08-23T16:35:42+05:30 IST