తెలుగోడి సత్తా..

ABN , First Publish Date - 2022-01-17T08:36:58+05:30 IST

తెలుగోడి సత్తా..

తెలుగోడి సత్తా..

తెలుగు కుర్రాడు సాత్విక్‌ సాయిరాజ్‌ ఇండియా ఓపెన్‌లో దుమ్మురేపాడు. ముంబై షట్లర్‌ చిరాగ్‌ శెట్టితో కలిసి పురుషుల డబుల్స్‌లో విజేతగా నిలిచాడు. అమలాపురానికి చెందిన సాత్విక్‌, చిరాగ్‌ జంట .. మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌ జోడీ మహ్మద్‌ అహ్‌సాన్‌-హెండ్రా సెతియావాన్‌కు షాకిచ్చి టైటిల్‌ అందుకుంది. తుదిపోరులో సాత్విక్‌-చిరాగ్‌ ద్వయం 21-16, 26-24తో ఇండోనేసియాకు చెందిన ప్రపంచ రెండో ర్యాంక్‌ జోడీ మహ్మద్‌-హెండ్రాను ఓడించింది. ఇండియా ఓపెన్‌ గెలవడం సాత్విక్‌ జోడీకి ఇదే మొదటిసారి. 2019లో  థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 500 టైటిల్‌ గెలిచిన సాత్విక్‌ ద్వయం.. అదే ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నీలో విజేతగా నిలిచింది.   

Updated Date - 2022-01-17T08:36:58+05:30 IST