అనంతలో తెలుగు మహిళ రాష్ట్ర నేతలను టార్గెట్ చేసిన YCP

ABN , First Publish Date - 2021-11-25T18:03:17+05:30 IST

తెలుగు మహిళ రాష్ట్ర నేతలు స్వప్న, విజయ శ్రీ ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. వారి ఇళ్ళలోకి వెళ్లి బంగారం నగలతో పాటు ఇతర వస్తువులను సీల్ చేస్తున్నారంటూ

అనంతలో తెలుగు మహిళ రాష్ట్ర నేతలను టార్గెట్ చేసిన YCP

అనంతపురం: తెలుగు మహిళ రాష్ట్ర నేతలు స్వప్న, విజయ శ్రీ ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. అధికార పార్టీ తీరును ప్రశ్నిస్తున్న వారిపై వైసీపీ నేతలు ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ప్రశ్నించే వారిని టార్గెట్‌గా చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా అనంతపురంలో తెలుగు మహిళ రాష్ట్ర నేతలు స్వప్న, విజయ శ్రీ ఇళ్ళలోకి వెళ్లి బంగారం నగలతో పాటు ఇతర వస్తువులను పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ మీడియాను కూడా అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు, తెలుగు మహిళా నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తెలుగు మహిళ రాష్ట్ర నాయకురాలు తేజస్వినికి చెందిన డ్రైవింగ్ స్కూల్ కార్లను పోలీసులు సీజ్ చేశారు. అయితే పోలీసుల తీరుపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహిళా నేతలకు జిల్లా టీడీపీ నేతలు అండగా నిలుస్తున్నారు.

Updated Date - 2021-11-25T18:03:17+05:30 IST