తెలుగు యువత ‘నిరుద్యోగ రణం’
ABN , First Publish Date - 2022-09-06T08:57:16+05:30 IST
తెలుగు యువత ‘నిరుద్యోగ రణం’
శ్రీకాకుళంలో ప్రారంభమైన యాత్ర
శ్రీకాకుళం, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): వైసీపీ సర్కారు నిరుద్యోగులను అన్నివిధాలా మోసం చేసిందని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాంచినబాబు విమర్శించారు. తెలుగు యువత ఆధ్వర్యంలో ‘నిరుద్యోగ రణం’ పేరిట రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న యాత్ర సోమవారం శ్రీకాకుళంలో ప్రారంభమైంది. ఎంపీ రామ్మోహన్నాయుడుతో కలిసి శ్రీరాం చినబాబు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాదయాత్రలో జగన్ నిరుద్యోగులకు మోసపూరిత హామీలిచ్చి ఓట్లు రాబట్టుకున్నారని, అధికారంలోకొచ్చాక జాబ్ క్యాలెండర్ను మరిచిపోయారని ఎద్దేవా చేశారు. జగనూ... జాబ్ ఎక్కడ? అని ప్రశ్నిస్తూ అన్ని జిల్లాల్లో ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. నిరుద్యోగులను మోసగించిన జగన్ను అధికారం నుంచి దించేంతవరకు తెలుగు యవత పోరాటం చేస్తుందని చెప్పారు.