కదంతొక్కిన తెలుగు యువత

ABN , First Publish Date - 2022-09-24T09:40:58+05:30 IST

కదంతొక్కిన తెలుగు యువత

కదంతొక్కిన తెలుగు యువత

ఏలూరు చేరిన నిరుద్యోగ రణభేరీ యాత్ర


ఏలూరు టూటౌన్‌, సెప్టెంబరు 23: తెలుగు యువత చేపట్టిన నిరుద్యోగ రణం పాదయాత్ర శుక్రవారం ఏలూరులో జరిగింది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చిన యువకులు ఏలూరు పాత బస్టాండ్‌కు చేరుకుని.. అక్కడ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించి పాదయాత్రగా ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడ ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. మోకాళ్లపై నిలుచుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరాం చినబాబు, రెడ్డి సూర్యచంద్రరావు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ఏటా ఉద్యోగాలు భర్తీ చేస్తానని, ప్రతీ జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామన్న జగన్‌.. అధికారంలోకొచ్చాక ఉద్యోగాల భర్తీ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు.  


Updated Date - 2022-09-24T09:40:58+05:30 IST