విగ్రహాల ధ్వంసం పిరికిపంద చర్య

ABN , First Publish Date - 2021-01-14T05:37:34+05:30 IST

విగ్రహాల ధ్వంసం పిరికిపంద చర్య అని ఎంపీ రామ్మోహన్‌నాయుడు అభివర్ణించారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఎన్టీఆర్‌, ఎర్రన్నాయుడు విగ్రహాలను పరిశీలించారు. ఎంపీ మాట్లాడుతూ విగ్రహాలను ధ్వంసం చేయడం దారుణమన్నారు. బాధ్యులను తక్షణం అదుపులోకి తీసుకొని చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్‌ శాఖపై ఉందన్నారు. ప్రజల మన్ననలతోనే తాము గెలిచామన్న విషయాన్ని గుర్తించుకోవాలని..ఇటువంటి ఘటనలను ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరముందన్నారు. టీడీపీ నాయకుల సహనాన్ని చేతకానితనంగా భావించవద్దన్నారు. ఎంపీ వెంట టీడీపీ నేతలు కింజరాపు హరిప్రసాద్‌, జీరు భీమారావు, రెడ్డి అప్పన్న, పుక్కళ్ళ శ్రీనివాసరావు, కర్రి విష్ణుమూర్తి, పంగ అసిరినాయుడు, మెండ అప్పారావు తదితరులు ఉన్నారు.

విగ్రహాల ధ్వంసం పిరికిపంద చర్య




ఎంపీ రామ్మోహన్‌నాయుడు

సంతబొమ్మాళి, జనవరి 13: విగ్రహాల ధ్వంసం పిరికిపంద చర్య అని ఎంపీ రామ్మోహన్‌నాయుడు అభివర్ణించారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఎన్టీఆర్‌, ఎర్రన్నాయుడు విగ్రహాలను పరిశీలించారు. ఎంపీ మాట్లాడుతూ  విగ్రహాలను ధ్వంసం చేయడం దారుణమన్నారు. బాధ్యులను తక్షణం అదుపులోకి తీసుకొని చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్‌ శాఖపై ఉందన్నారు. ప్రజల మన్ననలతోనే తాము గెలిచామన్న విషయాన్ని గుర్తించుకోవాలని..ఇటువంటి ఘటనలను ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరముందన్నారు. టీడీపీ నాయకుల సహనాన్ని చేతకానితనంగా భావించవద్దన్నారు. ఎంపీ వెంట టీడీపీ నేతలు కింజరాపు హరిప్రసాద్‌, జీరు భీమారావు, రెడ్డి అప్పన్న, పుక్కళ్ళ శ్రీనివాసరావు, కర్రి విష్ణుమూర్తి, పంగ అసిరినాయుడు, మెండ అప్పారావు తదితరులు ఉన్నారు. 



Updated Date - 2021-01-14T05:37:34+05:30 IST