కాస్త తగ్గిన ఎండలు

ABN , First Publish Date - 2021-04-11T09:11:04+05:30 IST

బంగాళాఖాతంలో అధికపీడనం కొనసాగుతోంది. దీంతో సముద్రం నుంచి దక్షిణ, ఆగ్నేయ దిశలో కోస్తా, రాయలసీమపైకి గాలులు వీస్తున్నాయి.

కాస్త తగ్గిన ఎండలు

అనంతలో గరిష్ఠంగా 38.4 డిగ్రీలు


అమరావతి/విశాఖపట్నం, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అధికపీడనం కొనసాగుతోంది. దీంతో సముద్రం నుంచి దక్షిణ, ఆగ్నేయ దిశలో కోస్తా, రాయలసీమపైకి గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో శనివారం అనేకచోట్ల మేఘాలు ఆవరించాయి. ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. కాగా శనివారం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం లేదా ఒకటి, రెండు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. అనంతపురంలో 38.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో అక్కడక్కడా ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. రెండు, మూడు రోజుల వరకు ఇదే వాతావరణం కొనసాగుతుందన్నారు. ఈ నెల 14 వరకు ఉత్తరాంధ్ర, యానాంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

Updated Date - 2021-04-11T09:11:04+05:30 IST