ఆలయ దర్శనానికి వెళ్తుండగా దుర్ఘటన.. వాగులో కొట్టుకుపోయిన 13 మంది

ABN , First Publish Date - 2021-12-10T03:33:57+05:30 IST

సంగం దగ్గర ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనతో పక్కనే ఉన్న బీరపేరు వాగులో ఆటో పడిపోయింది. ప్రమాద సమయంలో...

ఆలయ దర్శనానికి వెళ్తుండగా దుర్ఘటన.. వాగులో కొట్టుకుపోయిన 13 మంది

నెల్లూరు: సంగం దగ్గర ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనతో పక్కనే ఉన్న బీరపేరు వాగులో ఆటో పడిపోయింది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 13 మంది ఉన్నారు. గమనించిన స్థానికులు నలుగురిని కాపాడారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారి కోసం గాస్తున్నారు. బాధితులు నెల్లూరు జిల్లా జ్యోతినగర్‌కి చెందినవారిగా గుర్తించారు. ఆత్మకూరు దగ్గర ఆలయ దర్శనానికి వెళ్తుండగా ఘటన జరిగింది. 


Updated Date - 2021-12-10T03:33:57+05:30 IST