లాక్‌డౌన్ ముగిసే వరకూ దేవాలయాల్లో ఆన్‌లైన్ పూజలు

ABN , First Publish Date - 2020-05-23T11:46:14+05:30 IST

కర్ణాటక రాష్ట్రంలోని దేవాలయాల్లో లాక్‌డౌన్ ముగిసేవరకూ భక్తుల కోసం ఆన్‌లైన్‌లో పూజలు నిర్వహిస్తామని....

లాక్‌డౌన్ ముగిసే వరకూ దేవాలయాల్లో ఆన్‌లైన్ పూజలు

బెంగళూరు (కర్ణాటక): కర్ణాటక రాష్ట్రంలోని దేవాలయాల్లో లాక్‌డౌన్ ముగిసేవరకూ భక్తుల కోసం ఆన్‌లైన్‌లో పూజలు నిర్వహిస్తామని ఆ రాష్ట్ర మంత్రి కోట శ్రీనివాస్ పూజారి చెప్పారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల ప్రజలు దేవాలయాలను భక్తుల సందర్శనార్థం తెరవాలని కోరుతున్నారని, కానీ భక్తుల భద్రత దృష్ట్యా లాక్ డౌన్ ముగిసేవరకూ దేవాలయాలు తెరిచేది లేదని మంత్రి శ్రీనివాస్ స్పష్టం చేశారు.భక్తుల కోసం ప్రభుత్వం దేవాలయాల్లో ఆన్ లైన్ పూజలు నిర్వహించాలని యోచిస్తున్నామని మంత్రి వెల్లడించారు. భక్తులు ఆన్ లైన్ లో పూజలు చేసుకునే వీలు కల్పిస్తామని మంత్రి చెప్పారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలోని కొల్లూరు మూకాంబిక ఆలయం, చాముండేశ్వరీ దేవాలయంతోపాు పలు దేవాలయాల్లో ఆన్ లైన్ పూజలు జరిపిస్తున్నామని మంత్రి వివరించారు. కర్ణాటక రాష్ట్రంలో ఒక్క శుక్రవారం రోజే 138 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1743కి పెరిగింది. 

Updated Date - 2020-05-23T11:46:14+05:30 IST