రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరగడం సిగ్గుచేటు: విష్ణువర్ధన్రెడ్డి
ABN , First Publish Date - 2020-09-16T22:51:40+05:30 IST
రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరగడం సిగ్గుచేటని బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి అన్నారు. నిందితులపై చర్యలు తీసుకోకుండా భక్తులపై చర్యలు తీసుకోవడం అమానుషమన్నారు.
విజయవాడ: రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరగడం సిగ్గుచేటని బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి అన్నారు. నిందితులపై చర్యలు తీసుకోకుండా భక్తులపై చర్యలు తీసుకోవడం అమానుషమన్నారు. అంతర్వేది ఘటనలో నిందితులను పట్టుకోకుండా.. భక్తులను విచారణకు పిలవడం హాస్యాస్పదంగా ఉందని, అంతర్వేది కేసులో జైల్లో పెట్టిన మహిళా భక్తులను విడుదల చేయాలని విష్ణువర్ధన్రెడ్డి కోరారు.