జూలై 18 నుంచి దూరవిద్య పది, ఇంటర్ పరీక్షలు
ABN , First Publish Date - 2020-06-06T09:18:32+05:30 IST
పదవ తరగతి, ఇంటర్ దూరవిద్య పరీక్షలు జూలై 18 నుంచి 24వ తేదీవరకు నిర్వహిస్తున్నట్లు డీఈవో ఆర్ఎస్
గుంటూరు(విద్య), జూన్ 5: పదవ తరగతి, ఇంటర్ దూరవిద్య పరీక్షలు జూలై 18 నుంచి 24వ తేదీవరకు నిర్వహిస్తున్నట్లు డీఈవో ఆర్ఎస్ గంగాభవాని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షకు జిల్లావ్యాప్తంగా 16,919 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఇందులో పది విద్యార్థులు 7,109 మంది కాగా, ఇంటర్ విద్యార్థులు 9,810 మంది ఉన్నారని తెలిపారు. ఇంటర్ ప్రయోగ పరీక్షలు జూలై 25 నుంచి 29వ తేదీ వరకు జరుగుతాయని వెల్లడించారు.