పదివేల ఓబీసీ వైద్య సీట్లు జనరల్‌కు

ABN , First Publish Date - 2020-05-28T08:50:20+05:30 IST

జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) కింద ఓబీసీ విద్యార్థులకు మండల్‌ రిజర్వేషన్‌ను అమలు చేయలేదని పేర్కొంటూ

పదివేల ఓబీసీ వైద్య సీట్లు జనరల్‌కు

  • 15 రోజుల్లో వివరణ ఇవ్వండి: కేంద్రానికి ఎన్‌సీబీసీ నోటీసు 

న్యూఢిల్లీ, మే 27 : జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) కింద ఓబీసీ విద్యార్థులకు మండల్‌ రిజర్వేషన్‌ను అమలు చేయలేదని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రానికి జాతీయ బీసీ కమిషన్‌ (ఎన్‌సీబీసీ) నోటీసు జారీ చేసింది. 2017 నుంచి అఖిల భారత కోటా సీట్లలో నీట్‌ కింద ఓబీసీ విద్యార్థులకు 27 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయలేదని అఖిల భారత ఓబీసీ ఉద్యోగుల సంఘ సమాఖ్య ఎన్‌సీబీసీకి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై 15 రోజుల్లో జవాబు ఇవ్వాలని కేంద్ర వైద్యమంత్రిత్వశాఖను ఎన్‌సీబీసీ ఆదేశించింది.

Updated Date - 2020-05-28T08:50:20+05:30 IST