పదేళ్లయినా.. పట్టించుకోరా..!
ABN , First Publish Date - 2021-08-02T06:22:12+05:30 IST
చోళసముద్రం గ్రామంలో పదేళ్ల క్రితం లక్షల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు చేసి.. నిర్మించిన తాగునీటి ట్యాంకు ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నిర్లక్ష్యం వల్ల నేటికీ నిరుపయోగంగా ఉంది.
చోళసముద్రంలో నిరుపయోగంగా నీటి ట్యాంకు
లేపాక్షి, ఆగస్టు 1 : చోళసముద్రం గ్రామంలో పదేళ్ల క్రితం లక్షల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు చేసి.. నిర్మించిన తాగునీటి ట్యాంకు ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నిర్లక్ష్యం వల్ల నేటికీ నిరుపయోగంగా ఉంది. ఇప్పటికైనా ఆ ట్యాంకును ఉపయోగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్థులు కోరుతున్నారు.