పదేళ్ల బాలిక సాహసయాత్ర
ABN , First Publish Date - 2022-01-20T17:13:07+05:30 IST
మహిళల భద్రత, విద్య, పర్యావరణ పరి రక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేలా పదేళ్ల బాలిక కశ్మీర్ టు కన్నియా కుమారి వరకు సైకిల్ యాత్ర చేపట్టింది. ముంబై థానే ప్రాంతానికి చెందిన ట్యాంకర్ లారీ డ్రైవర్
- మహిళల భద్రత, విద్య, పర్యావరణ పరిరక్షణ
- కశ్మీర్ టు కన్నియాకుమారి
- సైకిల్పై ప్రచారం చేస్తున్న చిన్నారి
పెరంబూర్(చెన్నై): మహిళల భద్రత, విద్య, పర్యావరణ పరి రక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేలా పదేళ్ల బాలిక కశ్మీర్ టు కన్నియా కుమారి వరకు సైకిల్ యాత్ర చేపట్టింది. ముంబై థానే ప్రాంతానికి చెందిన ట్యాంకర్ లారీ డ్రైవర్ ఆశిష్ పటేల్ కుమార్తె జైపారి సాయిపటేల్ (10) 5వ తరగతి చదువుతోంది. మహిళా విద్య ప్రాధాన్యత, భద్రత, పర్యావరణ పరిరక్షణ కోసం జైపారి సాయిపటేల్ గత ఏడాది డిసెంబరు 14వ తేది కశ్మీర్ నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించింది. పంజాబ్, హర్యానా, రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక మీదుగా సుమారు 3,600 కి.మీ ప్రయాణించిన బాలిక మంగళవారం విరుదునగర్ చేరుకుంది. అరిమా సంఘం, వ్యాపార సంఘాలు బాలికకు ఘనస్వాగతం పలికాయి.. 21వ తేది కన్నియా కుమారి చేరుకొని యాత్ర ముగించనున్నట్లు జైపారి సాయిపటేల్ తెలిపింది.